సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాలు వచ్చాయంటే ఎంతో సందడి నెలకొంటుంది. సినిమా ముహూర్తం షూటింగ్ మొదలు ఆ సినిమా వీకెండ్ కలెక్షన్ల వరకు ఎంతో క్యూరియాసిటీ పెంచుతున్నారు చిత్ర యూనిట్. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పెద్ద హీరోల సినిమాలను విపరీతంగా ప్రమోషన్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇక థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్టా..ఫట్టా అనేది ఇట్టే తెలిసిపోతుంది. సాదారణంగా పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు పడడం సహజం.
అయితే ఈమధ్య హైదరాబాద్ పోలీసులు అందుకు సంబంధించిన పర్మిషన్లు ఇవ్వడం లేదు. పవన్ కల్యాణ్ కాటమరాయుడు నుంచి నిన్నటి పైసా వసూల్ వరకూ ఈ సమస్యే ఎదుర్కొంది. ఎన్టీఆర్ మొట్ట మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా జై లవకుశ. ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది..కాగా బుధవారం అర్థరాత్రి ఎలాగైనా సరే.. ఫ్యాన్స్ షో పడిపోవాల్సిందే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా గట్టిపట్టుపట్టారు.
ఇక నైజాం ఏరియా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో దిల్ రాజు తల్చుకుంటే కానిదంటూ లేదని టాక్ ఉన్నప్పటికీ..ఈసారి లవకుశకు మాత్రం కష్టమవుతోంది. దీనికి కారణం డీసీపీ సెలవులో ఉండడం, ఇన్ ఛార్జ్ డీసీపీ ఎటూ తేల్చకపోవడం. మరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న జై లవ కుశ బెనిఫిట్ షో పడుతుందా..? లేదా..? అనేది తెలియాలి.
కాకపోతే హైదరాబాద్ బ్రమరాంబలో తెల్లవారుఝామున 3 గంటలకు ఫ్యాన్స్ షో వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టికెట్లు కూడా అమ్మేశారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ రాకపోవడంపై ఉత్కంఠత కొనసాగుతుంది..ఆ మద్య పైసా వసూల్ చిత్రం ఉదయం 5 తర్వాత వేశారు. మరి లవకుశ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలి.