ప్రస్తుతం టాలీవుడ్ను జై లవకుశ ఫీవర్ ఓ ఊపు ఊపుతోంది. గురువారం ఈ సినిమా వరల్డ్వైడ్గా గ్రాండ్గా 2400 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే రిలీజ్కు ముందు ఏకంగా రూ.112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్లో రిలీజ్ అవుతోన్న తెలుగు సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక గురువారం రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు కొన్ని ఏరియాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు వేస్తున్నారు.
తమ అభిమాన హీరో సినిమా తొలి షో చూసేందుకు నందమూరి, ఎన్టీఆర్ అభిమానులు అయితే బుధవారం అర్దరాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తుండడంతో ఆయా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఫస్ట్ టైం ట్రిబుల్ రోల్ చేస్తోన్న ఈ సినిమాలో జై, లవ, కుశగా మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ అలరించబోతున్నాడు.
ఇక ఈ సినిమా ఫస్ట్ షో రిజల్ట్ బయటకు రాకుండానే పలువురు సినీ సెలబ్రిటీలు తమ రేటింగ్ ఇచ్చేస్తున్నారు. దుబాయ్ ఇండియన్ సినిమాల సెన్సార్ బోర్డ్ మెంబర్, ఫిల్మీ క్రిటిక్ ఉమైర్ సంధు సినిమా ఎన్టీఆర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడంతో పాటు జై లవకుశకు 3.5 రేటింగ్ ఇచ్చారు.
ఇక టాలీవుడ్ రాక్స్టార్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ జై లవకుశ సినిమాను డైరెక్టర్ బాబీ అద్భుతంగా తెరకెక్కించారని, యంగ్టైగర్ ఎన్టీర్ మైండ్బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడని దేవీ ట్వీట్ చేశాడు. రావణా అంటూ 'జై' పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టినట్టు హింట్ ఇచ్చారు. సెలబ్రిటీలు అందరూ సినిమాపై పాజిటివ్గా స్పందించడం చూస్తుంటే జై లవకుశ సినిమాకు హిట్ కళ కనపడుతోంది.