రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ స్పాట్ కు రాజమౌళి చిరంజీవితో కలిసి వెళ్ళడం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత హాట్ న్యూస్ గా మారింది. 1980 ప్రాంతానికి సంబంధించిన ప్రేమ కథను అత్యంత సహజంగా సుకుమార్ తీస్తున్న నేపధ్యంలో రాజమౌళి చాలసేపు ఈ మూవీ షూటింగ్ స్పాట్ లో ఉన్న నేపధ్యంలో జక్కన్న ‘రంగస్థలం’ కు తుది మెరుగులు దిద్దుతున్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనికితోడు ప్రస్తుతం రాజమౌళి వ్యవహరిస్తన్నా తీరును చూస్తుంటే మరొకసారి ‘మగధీర’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ చేయబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రాజమౌళి చాల క్లోజ్ గా ఉండడంతో ఈ సందేహాలు కలుగుతున్నాయి.

ఆమధ్య రాజమౌళి చిరంజీవి 151వ మూవీ ‘సైరా’ టైటిల్ లాంచ్ వేడుకలో పాల్గొనడం అలాగే విజయేంద్రప్రసాద్ ‘శ్రీవల్లి’ ఫ్రీ రిలీజ్ లో రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లడం బట్టి వీరిద్దరూ ఎదో ఒక పెద్ద భారీ ప్లాన్ లో  ఉన్నారు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈసారి రాజమౌళి చిరుతో కలిసి ‘రంగస్థలం -1985’ షూటింగ్ కి వెళ్లడం కూడా పలు అనుమానాలకు దారి తీస్తోంది.  

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ కోసం ఒక కథ రాయాలని ఉందని రచయిత విజయేంద్ర ప్రసాద్ చాలా ఇంటర్వ్యూలలో చెపుతూ ఉండటం అటువంటి కథను రాజమౌళి మాత్రమే తీయగలడు అని సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇలా రాజమౌళి ‘రంగస్థలం’ షూటింగ్ లో కనిపించడంతో ఆ ప్రాజెక్ట్ కి సంబందించి ఏదైనా బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.  

సాధారణంగా ఒక సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు దర్శకుడు ఆసినిమా హీరో టచ్ లో ఉంటారు. ఆ ప్రాజెక్ట్ అలా డిస్కస్ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భమే మళ్ళీ రిపీట్ అవుతోందని దానికి వేదిక ‘రంగస్థలం’ షూటింగ్ స్పాట్ అయిందని అన్నవార్తలు గుప్పుమంటున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: