నిన్న విడుదల అయిన ‘జై లవ కుశ’ సినిమా చూసి బయటకు వచ్చిన వారు అంతా జూనియర్ ప్రతిభను గురించి మాట్లాడుతూ ఉంటే ఈసినిమాలో కష్టపడి ఐటమ్ సాంగ్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తరువాత కూడ తమన్నాకు అవకాశాలు రాకపోవడం ఒక ఎత్తు అయితే కనీసం ఆమె చేసిన ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులు కూడ పట్టించుకాకపోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ న్యూస్ గా మారింది. 

దీనితో తమన్నా పై సానుభూతితో పాటు సెటైర్లు కూడ పడుతున్నాయి. ‘జై లవ కుశ’ లోని స్పెషల్ సాంగ్ తో తన ఉనికిని చాటుకోవాలని తమన్నా చాల ఆశలు పెట్టుకుంది. స్పెషల్ సాంగ్ అన్నంతనే మత్తెక్కించే అందాల్ని విచ్చలవిడిగా ఆరబోయడం అన్నసాంప్రదాయం ఉంది. 

అయితే ఆ గ్లామర్ షో కూడ లేకుండా కేవలం పిచ్చి పిచ్చిగా ఊగిపోయేలా డ్యాన్సులతో షాకిచ్చింది మిల్కీ బ్యూటీ. తనకేమాత్రం ఫిట్ కాని ఈ స్పెషల్ సాంగ్ లో తమ్మన్నాను చూసినవారు షాక్ అవ్వడమే కాకుండా ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలీదు కానీ ‘జైలవకుశ’ లోని స్పెషల్ సాంగ్ తమన్నాకు ఏ మాత్రం సాయం చేయదన్న మాటలు  వినిపిస్తున్నాయి. 

పిచ్చి పట్టిపోయినట్లుగా ఉగిపోవటంతో పాటు ఆమె మూమెంట్స్ కూడ అస్సలు బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక పాటతో కొత్త ఇమేజ్ ని సొంతం చేసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు హీరోయిన్స్ చేస్తూ ఉంటారు. 

కాజల్ కు ‘నేను పక్కా లోకల్’ పాట పోగొట్టుకున్న ఇమేజ్ ని ఆమెకు మళ్ళీ తెచ్చిపెడితే తమన్నాకు ఈ ఐటమ్ సాంగ్ తో ఉన్న ఇమేజ్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది అన్న సెటైర్లు పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: