ప్రిన్స్ మహేష్ బాబు వ్యవహార శైలి పై టాలీవుడ్ మీడియా అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ పై ఇలాంటి నెగిటివ్ గాసిప్పులు రావడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. ‘స్పైడర్’ విడుదలకు కేవలం వారంరోజులు గ్యాప్ కూడ లేదు. 

అయితే ఈమూవీ ప్రమోషన్ గురించి తెలుగు మీడియా సర్కిల్స్ లో ఇంకా హడావిడి ఏర్పడకపోవడం అత్యంత సంచలనంగా మారింది. మహేష్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈసినిమాకు ఇలాంటి తక్కువ పబ్లిసిటీ ఏమిటీ అని టాలీవుడ్ మీడియా సర్కిల్స్ తో పాటు మహేష్ అభిమానులు కూడ ఆశ్చర్యపోతున్నారు. 

అయితే దీనికి భిన్నంగా ‘స్పైడర్’ తో కోలీవుడ్ లో గ్రాండ్  ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ కోలీవుడ్ మీడియా కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు అక్కడి టీవీ ఛానల్స్ కు గేమ్ షోలకు అటెండ్ కానున్న మహేష్ జర్నలిస్ట్ లకు ఇచ్చే ఇంటర్వ్యూల విషయంలో కూడా స్పెషల్ ప్లాన్స్ వేసుకున్నట్లు తెలుస్తోంది. 

అందరికీ విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఓకే చేయడంతో ఎవరైనా జర్నలిస్టులు ఈ ఇంటర్వ్యూలను మిస్ అయితే వారికి ఫ్లైట్ టికెట్స్ హోటల్ రూమ్స్ ఏర్పాటు చేసి హైద్రాబాద్ కు పిలిచి ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తాడట మహేష్. దీనితో తెలుగుమీడియా సంగతి ఏమిటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 

గతంలో ‘బ్రహ్మోత్సవం’ విడుదల సమయంలో మహేష్ తెలుగు మీడియా ప్రతినిధులను ఒక స్టార్ హోటల్ కు పిలిచి ఒకొక్క జర్నలిస్ట్ కు 15 నిమిషాలు మాత్రమే కేటాయించాడు. దీనివల్ల అప్పట్లో కోపం తెచ్చుకున్న తెలుగు మీడియా వర్గాలు ‘బ్రహ్మోత్సవం’ పై నెగిటివ్ రివ్యూస్ వ్రాసాయి అన్న గాసిప్పులు కూడ వచ్చాయి. ఇప్పుడు కూడ మహేష్ అదే తప్పును రిపీట్ చేస్తూ టాలీవుడ్ మీడియాను మరిచిపోయి కోలీవుడ్ మీడియా వైపు ఎందుకు చూస్తున్నాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: