తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఇమేజ్ సంపాదించిన ఇలయదళపతి విజయ్. మొట్ట మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'మెర్సెల్. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. సమంత, కాజల్, నిత్యామేనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలై సంచలనం సృష్టిస్తుంది.
అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘అదిరింది’ అనే టైటిల్ ను పెట్టారు. దీపావళి సందర్భంగా అక్టోబరు 18న మెర్సెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇదివరకు విజయ్ అట్లీ కాంబినేషన్లో తేరి సినిమా వచ్చిన విషయం తెలిసిందే.ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మెర్సెల్ లో విజయ్ మూడు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నాడు.
సమంత, కాజల్, నిత్యామేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబరు 18న విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగులో నిర్మాత శరత్ మరార్ విడుదల చేయబోతున్నారు.