తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్లు గా వస్తున్న రకూల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, రెజినా లతో పాటు లావణ్య త్రిపాఠి కూడా మంచి విజయాలు అందుకుని తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  తాజాగా లావణ్య త్రిపాఠి పై దర్శకులు చంద్రమౌళి ఫిర్యాదు చేశారు.  అసలు విషయానికి వస్తే..తెలుగులో సూపర్ హిట్టయిన '100% లవ్' మంచి విజయవంతమైన విషయం తెలిసిందే.  
Image result for 100% love movie stills
ఈ చిత్రాన్ని తమిళంలో సుకుమార్ శిష్యుడు చంద్రమౌళి రీమేక్ చేస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా 100% కాదల్ పేరుతో తమిళంలో తెరకెక్కించనున్నాడు. ఇందులో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసి లండన్ లో షూటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో లావణ్య తాను ఈ సినిమా చేయలేనని చెప్పిందట.
Related image
దీంతో చిర్రెత్తుకొచ్చిన దర్శక, నిర్మాత  తమ హీరోయిన్ లావణ్య, తీవ్రంగా ఇబ్బందులు పెడుతోందన్నదని దీని వల్ల  తీవ్ర నష్టం వాటిల్లిందంటూ దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిలో చంద్రమౌళి ఫిర్యాదు చేశారు. లావణ్య బాధ్యతారాహిత్యంతో నష్టపోయామని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాదు లావణ్య స్థానంలో అర్జున్ రెడ్డి భామ షాలిని పాండేని కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: