బాహుబలి మూవీ ప్రాజెక్ట్ తో నేషనల్ సెలిబ్రిటీ గా మారిపోయిన రానా ఒకనాటి యాంగ్రీ హీరో రాజశేఖర్ ను ప్రమోట్ చేస్తూ రంగం లోకి దిగడం టాపిక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది.ఈ సీనియర్ హీరో చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ‘గరుడ వేగ’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి ఏడాది దాటుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సిమేమాకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ మూవీ పై ఎవరు ఊహించని విధంగా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాతో రాజశేఖర్ మళ్ళి ట్రాక్ లోకి వస్తడా అన్న అంచనాలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అయితే కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి వార్తలు బయటకు రాకపోవడంతో ఈ సినిమా గురించి చాలా మంది మరచి పోయారు.
ఇది ఇలా ఉండగా ఎట్టకేలకు ‘గరుడ వేగ’ ఫస్ట్ టీజర్ ను ఈ రోజు లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయంలో ఈ సినిమా యూనిట్ బాగా హడావిడి చేస్తోంది ఒకరు కాదుఇద్దరు కాదు ఏకంగా నలుగురు సెలబ్రెటీలతో వేర్వేరుగా సోషల్ మీడియాలో ‘గరుడ వేగ’ టీజర్ లాంచ్ చేయించబోతుండటంఇప్పుడు విశేషం గా మారింది.
రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, తాప్సి,మంచు లక్ష్మిల చేతులు మీదుగా ‘గరుడ వేగ’ టీజర్ లాంచ్ కాబోతోంది.
ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ నలుగురు ఒకేసారి తమ ట్విట్టర్- ఫేస్ బుక్ అకౌంట్ల ద్వారా ఈ టీజర్ ను లాంచ్ చేయబోతున్నారు . అయితే వీరంతా ఈ సినిమాకు సంభందించి నాలుగు రకాల టీజర్లు రిలీజ్ చేస్తారా?లేక ఒకే టీజర్ ను నలుగురు లాంచ్ చేస్తారా? అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారిగా రాజశేఖర్ ‘గరుడ వేగ’లో నటిస్తున్నాడు. ‘విశ్వరూపం’ హీరోయిన్ పూజాకుమార్ ఈ సినిమాలో కథానాయిక గా నటిస్తోంది .తమిళ నటుడు కిషోర్ విలన్ పాత్ర చేస్తున్నాడు. అయితే రాజశేఖర్ సినిమాలను ఎప్పుడో మరిచి పోయిన ప్రేక్షకులు ఉన్న నేటి రోజులలోఈ సినిమా పై 25 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టడం ఎవరికీ అర్ధం కాని విషయం గా మారింది.