టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన సినిమా జై లవకుశ. కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురువారం భారీ అంచనాల మధ్య వరల్డ్వైడ్గా 2400 స్క్రీన్లలో రిలీజ్ అయ్యింది. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా వసూళ్లతో ఎన్టీఆర్ సౌత్ ఇండియాలోనే ఓ తిరుగులేని రికార్డు సొంతం చేసుకున్నాడు.
జై లవకుశ దెబ్బకు తొలి రోజు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఎన్టీఆర్ ట్రిబుల్ రోల్తో పాటు జై రావన్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, దుబాయ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు కొల్లగొడుతోంది.
ఇక ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్టు తరుణ్ ఆదర్శ్ ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయని ట్విట్టర్లో వెల్లడించారు. అమెరికాలో ప్రీమియర్లతో 5,60,699డాలర్లు అనగా 3.64 కోట్లు రాబట్టి అక్కడి బాక్స్ఆఫీస్ వద్ద 18వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నాడు.
ఇక జై లవకుశ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ 29.28 కోట్ల కల్లెక్షన్స్తో ప్రపంచంలో అయిదో బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఇండియాలోనే ఈ సినిమాకు 25 కోట్లు వచ్చాయని తరుణ్ తెలిపారు. ఈ వారాంతానికే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లోకి సులువుగా చేరిపోతుందని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.