జైలవకుశ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ ప్రవాహాన్ని చూసి జూనియర్ అభిమానులు పండుగ చేసుకుంటూ ఉంటే ఆ సినిమా విడుదల అయి మూడవ రోజులోకి  ప్రవేసించినా ఇంకా ఆ సినిమా పై జరుగుతున్న నెగెటివ్ ప్రచారం చాలా మందికి షాక్ ఇస్తోంది  దీనితో జూనియర్ కు భగవంతుడు మంచి రూపం తో పాటు మంచి టాలెంట్ ఇచ్చినా టాలీవుడ్ లో అజాత శతృవు గా జూనియర్ మారే అదృష్టం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి .
 
వాస్తవానికి ప్రస్తుతం జూనియర్ పై జరుగుతున్న నెగెటివ్ ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా  ఎన్టీఆర్ మీద వున్నంత నెగిటివ్ ప్రచారం  ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలలో మరెవ్వరి పైనా  జరగడం లేదు అన్న విషయం వాస్తవం అని అంటున్నారు విశ్లేషకులు.  జై లవకుశ మొదటి షో  పడిన దగ్గర నుంచి ప్రారంభమైన నెగెటివ్ ప్రచారం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది .
 
ఈ సినిమాలో పెద్దగా ఏమిలేదు ఫ్యాన్స్ కు కూడా పెద్దగా నచ్చలేదు ఎన్టీఆర్  డాన్సులు జై పాత్ర  తప్ప ఈ సినిమాలో ఏముంది అంటూ ఒక నెగెటివ్ ప్రచారం ఇప్పడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా నిన్న శుక్రవారం నుండి   సీడెడ్ లో ఈ సినిమాకు సంభందించి  కొన్ని థియేటర్లు ఖాళీ అంటూ మరో విష ప్రచారంఈ సినిమా పై మొదలు అయింది .

 ఇది చాలదు అన్నట్లుగా ఈ సినిమాలో కూడా కొన్ని డైలాగులను టిడిపికి ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సినిమాలో ని ఒక డైలాగ్ ‘మనం అనే దానిలో అర్థం  లేదునేను అనేదే నిజం’అనే డైలాగ్ వెనుక జూనియర్ రాజకీయ ఆలోచనలు బయట పడుతున్నాయి అన్న ప్రచారం కుడా జరుగుతోంది . దీనికి తోడు జూనియర్ ఈ సినిమాలో మరోచోట ‘గెలిచిన వారికంటే గెలిపించడానికి సహకరంచిన వ్యక్తికి ఎక్కువ గుర్తింపు  ఉంటుంది’ అన్న డైలాగ్ వెనుక కుడా జూనియర్ రాజకీయ ఆలోచనలు బయట పడుతున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనానెగెటివ్ ప్రచారాన్ని ఎదిరుస్తూ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న జైలవకుస ఏ రేంజ్ హిట్ గా మారుతుంది అన్న విషయం ఈ వీక్ ఎండ్ తరువాత తేలి పోతుంది .


 



మరింత సమాచారం తెలుసుకోండి: