ప్రిన్స్ మహేష్ ను తన ప్రశ్నలతో పోసాని కృష్ణమురళీ విసిగిస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు మీడియాకు లీక్ కావడంతో ఆ ఫోటో ట్రేండింగ్ గా మారింది. అసెంబ్లీలో ఒక రాజకీయ విషయమై పోసాని మహేష్ ను ఇరుకున పెడుతున్నాడు. 

మహేష్‌బాబు కొరటాల శివ కాంబినేషన్ లో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘భరత్ అనే నేను’ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో అసెంబ్లీ భవనాన్ని తలపించే విధంగా వేసిన ఈ సెట్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్ని వేసాలు సుమారు 40 రోజులపాటు షూట్ చేసినట్లు తెలుస్తోంది. 

రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. ‘నిన్ను నీవు తెలుసుకో’ అని రామకృష్ణ పరమహంస చెప్పిన మాటల స్పూర్తితో ఈ కథను అల్లినట్లు తెలుస్తోంది. 

అత్యంత వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సంక్రాంతికి రాబోతున్న సినిమాను టార్గెట్ చేస్తూ విడుదల చేయబోతున్నారు. ఈ ఫోటోలో పోసాని ప్రశ్నిస్తుంటే  పక్కన జీవా బెనర్జీ లు కూడా ఇందులో కనిపిస్తున్నారు. 

తన గురువు బంధువు అయిన పోసానిని ఒక విభిన్నమైన రాజకీయ నాయకుడుగా చూపెడుతున్న ఈసినిమాలో పోసాని చేత నేటి రాజకీయాల పై చాల సెటైర్లు వేయించినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడని మహేష్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఈసినిమాలో కనిపించబోతు ఉండటం ఈ మూవీలోని ప్రధాన ట్విస్ట్..       



మరింత సమాచారం తెలుసుకోండి: