‘ప్రేమమ్’ లో మలార్ పాత్రతో మళయాళ ప్రేక్షకులకు ‘ఫిదా’ సినిమాలో భానుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయిన సాయి పల్లవి ప్రస్తుతం క్రేజీ హీరోయిన్. ‘ఫిదా’ లో ఆమె నటనకు డైలాగ్ డెలివరీకి డ్యాన్సులకు తెలుగు ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే. 

దీనితో ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఆమెకు ఆఫర్స్ ఇస్తూ భారీ పారితోషికాలు కూడ ఆఫర్ చేస్తున్నారు. అయితే  సాయిపల్లవి మాత్రం చాలా ఆఫర్స్ కు నో  చెపుతూ ఆచితూచి చాలా సెలక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది. 

‘ఫిదా’ సినిమా విజయం వెనుక శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ ఎంతో  ఉన్న  ఆ క్రెడిట్ అంతా సాయి పల్లవి ఎకౌంటులోకి వెళ్లి పోవడం ఏకంగా శేఖర్ కమ్ములకే షాకింగ్ గా మారింది అన్న వార్తలు కూడ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ‘ఫిదా’ ఘన విజయం ఇచ్చిన కిక్ తో సాయిపల్లవి   ఇప్పుడు ఎవరినీ కేర్ చేయడంలేదట.  

దీనికితోడు తన సహజ నటనతో పేరు తెచ్చుకున్న ఒక యంగ్ హీరో సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి  ఆ సినిమా షూటింగ్ స్పాట్ లో   అంతా తనిష్టం అన్నరీతిలో వ్యవహరిస్తున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు సంబంధించి   షూటింగ్ కు లేటుగా రావడం అదేమని అసిస్టెంట్ డైరెక్టర్లు అడిగినా సమాధానం ఇవ్వకుండా సాయి పల్లవి ప్రవర్తిస్తున్న తీరుపై ఇండస్ట్రీ వర్గాలలో రకరకాల కధనాలు గాసిప్పులు గా హడావిడి  చేస్తున్నాయి.

దీనికితోడు ఆ యంగ్ హీరోతో సాయిపల్లవికి మాటామాటా తేడా రావడంతో అసహనానికిలోను అయిన ఆహీరో చివరకు ఆమూవీ సెట్స్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయాడని టాక్. అయితే ఈవ్యహారంలోతప్పెవరది అన్నదానిపై క్లారిటీ లేకపోయినా సాయిపల్లవి తీరును మాత్రం చాలా మంది విమర్శిస్తున్నట్లు టాక్. ఈ వార్తలలో ఎన్ని యధార్ధాలో తెలియక పోయినా ఇలాంటి గాసిప్పులు ప్రచారంలోకి రావడం సాయిపల్లవి  కెరియర్ కు  ఏమాత్రం మంచిది కాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: