‘జై లవ కుశ’ విడుదలై నాలుగు రోజులు పూర్తి అయి నేటితో ఐదవ రోజులోకి ఈసినిమా ప్రవేసిస్తోంది. అయితే ఈసినిమా అత్యంత ఘన విజయం సాధించింది అంటూ నిర్మాత కళ్యాణ్ రామ్ నిన్న ప్రముఖ పత్రికలకు విడుదల చేసిన భారీ ప్రకటనల పై ఇప్పుడు రగడ రేగుతోంది.

ఈమూవీ మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్లు వసూలు చేసింది అంటూ కళ్యాణ్ రామ్ ఇస్తున్న ప్రకటనలు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమా పై మిశ్రమ స్పందన రావడంతో పాటు ఈసినిమా ప్రదర్శింపబడుతున్న కొన్ని ఏరియాలలో మార్నింగ్ షో మ్యాట్నీ కలక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ ప్రకటనలోని నిజాలు ఎంత అనే విషయం పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 

ప్రస్తుతం ‘జై లవ కుశ’ టీమ్ అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తూ ఉంటే ఈసినిమా మొదటివారం పూర్తి అయ్యేసరికి 150 కోట్ల కలక్షన్స్ రాబట్టిన సినిమాగా మారింది అంటూ ‘జై లవ కుశ’ టీమ్ ప్రకటనలు గుప్పించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇదే జరిగితే ‘జై లవ కుశ’ ‘బాహుబలి’ పార్ట్ 1 కలక్షన్స్ తో సమానం అయింది అన్న ప్రచారం జరిగే ఆస్కారం ఉంది.

జూన్ నెలలో విడుదల అయిన ‘దువ్వాడ జగన్నాథం’ కలక్షన్స్ విషయంలో కూడ ఇటువంటి భారీ ప్రకటనలు ఇచ్చి ఆసినిమాను నిలబెట్టడానికి చాల ప్రయత్నించారు. అయితే ఆమూవీ రెండవ వారం నుండి కలక్షన్స్ విషయంలో పూర్తిగా ఎదురీత ఈదవలసి వచ్చింది. ఈ పరిస్థుతుల నేపధ్యంలో ‘జై లవ కుశ’ కు కూడ దసరా తరువాత కూడ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అని అంటున్నారు. ఏది ఎలా చూసుకున్నా జూనియర్ ఈసినిమా పై పెట్టుకున్న ఆశలు పగటి కలగానే మిగిలిపోయినట్లు అనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: