తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. గత మూడు సంవత్సరాల నుంచి వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న ఈ నందమూరి కుర్రోడు తాజాగా బాబీ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘జై లవ కుశ’ చిత్రంతో మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన మూడు విభిన్నమైన పాత్రలు బాగా అలరించాయని..ముఖ్యంగా జై పాత్రకు ఎన్టీఆర్ ప్రాణం పోశారని కితాబు ఇస్తున్నారు ప్రేక్షకులు. ఎన్టీఆర్ నటనపై ఇప్పటికే పలువురు ఇండస్ట్రీ పెద్దలు ప్రశంసల జల్లు కురిపించగా తాజాగా కమెడియన్ ఫృథ్విరాజ్ ఎన్టీఆర్ ని తెగ పొగిడేస్తున్నాడు. ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ లో ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు శాల్యూట్.
ఎన్టీఆర్ టాలెంట్ను పవర్ హౌస్తో పోల్చారు పృథ్వీ. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న ఉత్తమ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని పృథ్వీ కితాబిచ్చారు. తారక్ అద్భుతమైన నటనను చూడడం సంతోషాన్నిచ్చిందని పృథ్వీరాజ్ చెప్పారు.