మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీదకు వెళ్లబోతుంది. క్రేజీ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమకు సీక్వల్ గా ఉండబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. కరుణాకరణ్ డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.


అప్పటి యూత్ అంతటిని ఆ సినిమా ఓ రేంజ్ లో టచ్ చేసింది. ఇక ఆ సినిమా సీక్వల్ అంటే మళ్లీ అదే రేంజ్ యూత్ఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేయడం ఖాయం. మొదలు పెట్టే ముందు ఎలా అనుకున్నారో ఏమో కాని ప్రస్తుతం తేజ్ తో కరుణాకరణ్ చేసే సినిమా మాత్రం తొలిప్రేమకు సీక్వల్ అని గట్టిగా చెబుతున్నారు.


తిక్క, విన్నర్ సినిమాల ఫ్లాపులతో కెరియర్ కాస్త సంక్షోభంలో పడేసుకున్న సాయి ధరం తేజ్ రాబోతున్న జవాన్ తో పాటుగా ఇక నుండి చేసే ప్రతి సినిమా గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నాడు. జవాన్ తర్వాత వినాయక్ తో దుర్గ సినిమా చేస్తున్న తేజ్ ఆ తర్వాత కరుణాకరణ్ సినిమా షూట్ లో పాల్గొననున్నాడు.  


హిట్ కొట్టిన రెండు మూడు సినిమాలతో మెగా అభిమానుల మనసు గెలుచుకున్న తేజ్ ఇక నుండి హిట్ సినిమాలే చేయాలని చూస్తున్నాడు. కెరియర్ ప్లానింగ్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న సాయి ధరం తేజ్ రాబోతున్న సినిమాల ఫలితాలు ఎలా ఉండబోతాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: