మరి కొద్ది గంటలలో మహేష్ బాబు అభిమానులకు దసరా పండుగ హడావిడి మొదలు కాబోతోంది. ప్రిన్స్ అభిమానులకు రేపటి 'స్పైడర్' రిలీజ్  పెద్ద పండుగగా మారింది. ఇప్పటికే మన  తెలుగు రాష్ట్రాల్లో 'స్పైడర్' మ్యానియా మొదలు కావడంతో ఆసినిమా విడుదలకాబోతున్న థియేటర్స్ ఎదుట మహేష్ అభిమానులు ఇప్పటి నుంచే హడావిడి మొదలుపెట్టేసారు.

 ఓవర్సీస్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం నుంచే ప్రీమియర్స్ పడిపోతాయి. దీనితో ఇవాళ అర్ధరాత్రి సమయానికే 'స్పైడర్' ఫస్ట్ టాక్ బయటకురాబోతోంది. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు 'స్పైడర్' గురించి బుల్లి తెరపై ఇంకా ఇంటర్వ్యూలు ఇవ్వని మహేష్ సాక్షి న్యూస్ ఛానల్ కు ఒక ప్రత్యేక  ఇంటర్వ్యూ ఇచ్చాడు. 

అయితే ఈ ఇంటర్వ్యూ కూడ ఒక ప్రయోగమే. ఇప్పటికే బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక  ఇమేజ్ ఏర్పరచుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ ఇంటర్వ్యూ నిర్వహించడం హాట్ టాపిక్ గామారింది. త్వరలోనే ఈ కార్యక్రమం టెలికాస్ట్ కానుంది అటు బుల్లితెర పై ఇటు పాలిటిక్స్ లోను ఫుల్ యాక్టివ్ గా ఉండే రోజా మహేష్ బాబును ఇంటర్వ్యూ చేయడం ఇప్పుడు అనేక మందికి ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు మహేష్ కూడా ఇలాంటి స్పెషల్ ఇంటర్వ్యూలకు బాగా కేర్  తీసుకునే నేపధ్యంలో ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు ఉంటాయి అన్న అంచనాలు కలుగుతున్నాయి.
 
గతంలో రోజా మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150' విషయంలో కూడా చిరంజీవితో  స్పెషల్ ఇంటర్వ్యూ చేసి అనేక విషయాలను రాబట్టిన  విషయం తెలిసిందే. ఇదిఇలాఉండగా మహేష్ నిన్న జరిగిన ఒక  మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు 'స్పైడర్' విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది తనకు ఆకలి నిద్రా తగ్గిపోతున్నాయి అంటూ కామెంట్స్ చేసాడు . దీనిని  బట్టి చూస్తూ ఉంటే  'స్పైడర్' రిజల్ట్ గురించి మహేష్ ఏ స్థాయిలో టెన్షన్ పడుతున్నాడో అర్ధం అవుతుంది.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: