ప్రస్తుతం టాలీవుడ్ లో కథలకు కొరత వచ్చిన విషయం తెలిసిందే. దీనితో నానా తంటాలు పడి ఒక కధను సెట్ చేసుకుని సినిమా మొదలు పెట్టాక ఆ సినిమా కధ పై వివాదాలు రావడం ఆకధను కాపీ కొట్టారు అంటూ వార్తలు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి విషయాలు ఎక్కువగా ప్రముఖ హీరోలకు సంబంధించిన సినిమాల పై ఈ మధ్య తెగవస్తున్నాయి.
‘శ్రీమంతుడు’ కథ కేసు ఇప్పటకీ కోర్టులో నడుస్తోంది. ఆమధ్య వచ్చిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ స్టోరీ పై కేసు పడింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన ‘జై లవ కుశ’ లో హీరోకి నత్తి ఉండడం అన్న పాయింట్ డైరక్టర్ బాబి ది కాదు డైరక్టర్ ఫూరిజగన్నాధ్ ది అంటూ ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి.
ఇప్పడు ఈలిస్టులో హీరో నాగ చైతన్య కూడ చేరిపోయాడు చైతు చందు మొండేటి కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ‘సవ్యసాచి’ సినిమా కూడా ఇబ్బందుల్లో పడిందని గాసిప్పులు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోకి ఎడం చేయి అతని మాట వినదు. దానికి సెపరేట్ బ్రెయిన్ రూట్ ఉంటుంది అని టాక్.
అయితే ఈ కథలోని ముఖ్యమైన ఈ పాయింట్ తాను వ్రాసుకున్న కథలోనిది అంటూ ప్రముఖ రచయిత డైమండ్ రత్నం రైటర్స్ అసోసియేషన్ ముందు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. దీనితో ఇప్పుడు ఈసినిమా కథను మారుస్తారా ? లేదంటే అతడితో రాజీ చేసుకుంటారా అనే విషయమై రకరకాల గాసిప్పులు ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్ లో హడావిడి చేస్తున్నాయి..