ఈమధ్య తెలుగు సినిమా అంటే బాలీవుడ్ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. బడ్జెట్ రేంజ్ తో పాటుగా కలక్షన్స్ రేంజ్ కూడా సినిమా సినిమాకు పెంచుకుంటూ వెళ్తున్న సౌత్ సినిమా ముఖ్యంగా తెలుగు స్టార్ సినిమా అంటే బాలీవుడ్ నుండి ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. ప్రస్తుతం రేపు థియేటర్ లోకి రానున్న సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ పై బాలీవుడ్ కన్ను పడింది.


అందుకే నేషనల్ మీడియా సైతం రిలీజ్ అవుతున్న స్పైడర్ గురించి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది. అనుపమ చోప్రా వ్యాఖ్యానంలో మహేష్ చిట్ చాట్ జరిగింది. బాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ చేయబడిన వారిలో మహేష్ రెండో హీరో అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టైంలో పవన్ కళ్యాణ్ అనుపమకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. 


ఇక ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న స్పైడర్ గురించి తెలుసుకునేందుకు ఈ స్పెషల్ చిట్ చాట్ ఏర్పాటు చేశారు. ఇక ఇది ముగిసిన వెంటనే మహేష్ తో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉందని.. తను ఎంపిక చేసుకున్న బ్యాడ్ స్క్రిప్ట్ తన ఫేం ను మార్చాయని ఎంతో హుందాగా మహేష్ చెప్పారని.. తనతో ఈ చిట్ చాట్ చాలా బాగుందని ట్వీట్ చేసింది.


ఇక తెల్లవారితే స్పైడర్ సంచలనాలు సిద్ధమవుతుండగా ప్రతి సూపర్ స్టార్ అభిమాని దసరాకు ముందే పండుగ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. 120 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా అదే రేంజ్ లో బిజినెస్ చేసింది. మరి సినిమా ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే మరో 12 గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: