తెలుగు ఇండస్ట్రీలో ఓ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యిందీ అంటే దానికి కథ బలం ఎంత ఉన్నా..డైరెక్షన్ ఎంత గొప్పగా ఉన్నా..నటీ నటుల పర్ఫామెన్స్ ఎంత బాగున్నా..సినిమా మ్యూజిక్ కీలక పాత్ర వహిస్తుంది.  సినిమాలో పాటలు హిట్ అయ్యాయీ అంటే..సగం సినిమా హిట్ అయినట్లే టెక్క. ఇక ఇండస్ట్రీలో తన అద్భుతమైన సంగీతాన్ని అందించి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన ఘనత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణికే దక్కుతుంది.  ప్రేమ గీతాలే కాదు..భక్తి రస చిత్రాలకు కూడా ఆయన అందించిన సంగీతం ఇప్పటికీ ఎప్పటికీ మరువలేం. 
Image result for savyasachi posters
ఇక తెలుగు సినిమా చరిత్ర మార్చిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలకు సంగీతం అందించిన కీరవాణి తరువాత మరో సినిమాకి సంగీతాన్ని అందించలేదు.  గతంలో బాహుబలి 2 చిత్రం తర్వాత సంగీత ప్రపంచానికి గుడ్ బాయ్ చెబుతానని స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.  కానీ ఇండస్ట్రీ వర్గం మాత్రం ఆయన ఇప్పట్లో గుడ్ బాయ్ చెప్పొద్దని సలహా ఇస్తూ వచ్చారు.  ఆ మద్య సంగీతం పట్ల అవగాహన లేని దర్శకులతో కలిసి పనిచేయవలసి వచ్చిందనీ, డబ్బు కోసం అలాంటి దర్శకులతో కలిసి పనిచేయవలసి వచ్చిందంటూ వివాదానికి తెరతీశారు.   
Related image
తర్వాత తన మైండ్ సెట్ కి దగ్గరగా వున్న దర్శకులతో మాత్రమే కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.  ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కీరవాణి రాజమౌళి సినిమాలకి తప్ప ఇతరుల సినిమాలకి సంగీతాన్ని అందించరని రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి.  తాజాగా వీటన్నింటికి చెక్ పెడుతూ.. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సవ్యసాచి' సంగీతాన్ని అందించడానికి కీరవాణి అంగీకరించారట. 
Image result for baahubali 2 posters
ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.  బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత కీరవాణి చేయబోయే చిత్రం ఇదే అవుతుంది..మరి తన సంగీత మంత్రంతో మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తారని ఆయన సంగీతాన్ని ఇష్టపడే అభిమానులకు ఇది శుభవార్తే.   


మరింత సమాచారం తెలుసుకోండి: