తెలుగు, మళియాళ ఇండస్ట్రీలో ఒకటీ రెండు చిత్రాలతో అదృష్టం కలిసి వచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. కుటుంబ నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన ‘ఫిదా’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంతో సాయి పల్లవి కి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.
మళియాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ లో శృతిహాసన్ పాత్రలో నటించింది. వాస్తవానికి సాయిపల్లవి తెలుగు లో బుల్లితెరపై ఢీ రియాలిటీ డ్యాన్స్ షో మెరుపులా మెరిసింది. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు ఫిదా చిత్రంలో హీరోయిన్ తళుక్కున మెరిసింది. ప్రస్తుతం ఆమె నాని జోడీగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె 'ప్రేమమ్' మలయాళ సినిమాకి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పింది. ఈ సినిమా షూటింగ్ లో తన గుప్పిట్లో ఓ సీతాకోక చిలుక పట్టుకోవాల్సి వస్తుంది. షూటింగ్ అయ్యే వరకు ఆ సీతా కోక చిలుక నా గుప్పిట్లోనే ఉండటంతో పాపం దానికి ఊపిరి ఆడక చనిపోతుందేమో అని చాలా భయం, బాధ వేసిందట.
మొత్తానికి సన్నివేశం పూర్తియ్యింది..గుప్పిటిలో ఉన్న సీతాకోక చిలుక ఎగిరిపోయింది. ఆ తర్వాత ఇలాంటి సన్నివేశాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు సాయిపల్లవి తెలిపింది. ప్రకృతిని ఆరాధించడం . అందులోని జీవరాశిని చూసి ఆనందించడం చేయాలి తప్ప, దేనికీ హాని చేయకూడదని చెప్పుకొచ్చింది.