ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది..గతంలో హీరోలుగా ఉన్నవారు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్లు గా వస్తున్నారు. హీరోగా ఎంత గొప్పగా మెప్పించారో..విలన్ గా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోలుగా చెప్పుకునే జగపతిబాబు, శ్రీకాంత్ విలన్లు గా నటిస్తున్నారు. గతంలో విలన్లు గా నటించిన వారు తండ్రులు, మామయ్య ల పాత్రలతో పాజిటీవ్ గా నటిస్తున్నారు. తాజాగా మరో హీరో విలన్ గా రాబోతున్నాడు.
ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా..! 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రంతో పరిచయమై దాదాపు 30 చిత్రాల్లో హీరోగా నటించిన ఆదిత్య ఓం. ఆ మద్య ఆదిత్య ఓం నటించి, దర్శకత్వం వహించిన 'ఫ్రెండ్ రిక్వెస్ట్' విజయాన్ని అందుకుంది. వాస్తవానికి ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా రాణిద్దామని వచ్చిన ఆదిత్య ఓం..అనుకోకుండా హీరోగా మారారు.
గత కొంత కాలంగా మనోడి సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో..ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ ఫాలో అయితే కెరీర్ ఏమైనా గాడిన పడేట్టు ఉందని భావించిన ఆదిత్య ఓం..విలన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారట. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కొనసాగుతుంది కనుక తాను విలన్ గా నటించి మెప్పించగలనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆదిత్య ఓం.
నేడు ఆదిత్య ఓం పుట్టినరోజు సందర్భంగా ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయంలో తనకు సీనియర్ నటులైన జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్లను ఆదర్శంగా తీసుకున్నట్టు తెలిపారు. ఇకపై విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం తనకు వుందని ఆదిత్య ఓం తెలిపారు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆదిత్య ఓం కి జన్మదిన శుభాకాంక్షలు.