ఒకప్పుడు టాప్ డైరక్టర్ గా ఉన్న శ్రీనువైట్ల స్టార్స్ తో కూడా ఫ్లాపులు తీయడంతో కెరియర్ లో చాలా ఎదురుదెబ్బలు తిన్నాడు. ఫ్లాపుల్లో ఉన్నా సరే దర్శకుడిని క్రేజ్ దృష్టిలో ఉంచుకుని అతనితో 10 కోట్ల సినిమా చేశారు మిస్టర్ నిర్మాతలు. సినిమా టీజర్ పర్వాలేదు అన్నట్టు అనిపించినా రిలీజ్ తర్వాత శ్రీనువైట్ల మారలేదని అర్ధమైంది.


వరుణ్ తేజ్ కెరియర్ మరో డిజాస్టర్ గా మిస్టర్ మిగలగా సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకు డబ్బులివాలన్న కమిట్ మెంట్ ఏర్పరచుకున్నాడట శ్రీను వైట్ల. ఆ లెక్క ప్రకారం తీసుకున్న 3 కోట్ల రెమ్యునరేషన్ లో 85 లక్షల దాకా రిటర్న్ చేశాడట శ్రీను వైట్ల. తీసుకున్న రెమ్యునరేషన్ సగం పైగా అడిగినా తన దగ్గర అంతకుమించి లేకపోవడంతో ఉన్నమొత్తం ఇచ్చి చేతులు దులుపుకున్నాడట.


కష్టకాలంలో సినిమా వచ్చినా అది కాస్త నిరాశ పరచడంతో తీసుకున్న రెమ్యునరేషన్ ఎమౌంట్ కాస్త తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మిస్టర్ ఫ్లాప్ తో కంటికి కూడా కనిపించని శ్రీనువైట్ల తన తర్వాత సినిమా మాస్ మహరాజ్ రవితేజతో చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతం రవితేజ అనీల్ తో రాజా ది గ్రేట్, విక్రం సిరితో టచ్ చేసి చూడు సినిమాలు చేస్తున్నాడు. 


ఈ రెండు సినిమాల తర్వాత శ్రీను వైట్లతోనే సినిమా చేయాలని చూస్తున్నాడట రవితేజ. మరి కష్టకాలంలో ఉన్న శ్రీను వైట్లకు రవితేజ హెల్పింగ్ హ్యాండ్ ఇస్తాడా లేక సైలెంట్ గా పక్కకు తప్పుకుంటాడా అన్నది వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: