తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ లతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి నటిగా, టివి యాంకర్ గా రాణిస్తుంది. ఇప్పటి వరకు వెండి తెరపై, బుల్లి తెరపై తన సత్తా చాటుతున్న మంచు లక్ష్మి ఎప్పుడూ సోషల్ మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మికి కోపం వచ్చింది..దేనికో తెలుసా..గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఎడతెడిప లేకుండా వర్షాలు పడుతున్నాయి.
వర్షాల కారణంగా రోడ్లపై విపరీతంగా నీరు రావడంతో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కష్టాలు మంచు లక్ష్మిని కూడా వదల్లేదు..దీంతో మెట్రో పనులతో రోడ్డు బ్లాకులు, మళ్లించిన రోడ్లలో గతుకులు, ఎప్పటికప్పుడు పలకరించే ట్రాఫిక్ సమస్యలు హైదరాబాదీలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. తాజాగా ఈ ఇబ్బందుల బారిన సినీ నటి మంచు లక్ష్మి పడింది. హైదరాబాదు రోడ్లపై ప్రయాణం రోజురోజుకీ కష్టసాధ్యమవుతోందని ప్రజలు ఈ కష్టాలు ఎన్నిరోజులు పడతారని ప్రశ్నిస్తుంది.
ఈ మేరకు ట్వీట్ చేసిన మంచు లక్ష్మి 'గంటన్నర పాటు హైటెక్స్ ఏరియాలో ట్రాఫిక్ కారణంగా చిక్కుకున్నాను. రాజకీయ నాయకులు మాలాగ సాధారణ పౌరులుగా ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా నగర రోడ్లపై ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది' అంటూ ట్వీట్ చేసింది. మంచు లక్ష్మి స్పందనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో కానీ..ఆమె అభిమానులు మాత్రం బాగా మెచ్చుకుంటున్నారు.