కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు చాలా నెలల క్రితం అన్న మాటకీ , ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పితాని తాజాగా అన్న మాటలకీ ఒకేసారి స్పందించిన పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో కాసేపు సంచలనం సృష్టించారు.

పవన్ కళ్యాణ్ ఎవరో తమకి తెలీదు అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి పితాని , అశోక్ గజపతి రాజుల విషయం లో పవన్ కళ్యాణ్ వెటకారం గా స్పందిస్తూ 'అశోక్ గ‌జ‌ప‌తి రాజుకి, మంత్రి పితానికి నేను ఎవ‌రో తెలియ‌దట.. సంతోషం' అంటూ ప‌వ‌న్ తన ట్వీట్‌లో చురక అంటించారు.

దీనికి స్పందన అమాంతం పెరుగుతూ ట్విట్టర్ లో ' ఘజిని ఆంధ్రా మంత్రులు ' అనే ట్రెండ్ కూడా ట్రెండ్ అయ్యింది. దీంతో కంగారు పడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు.

త‌మ పార్టీ నేత‌లు ప‌వ‌న్‌పై చేస్తోన్న వ్యాఖ్య‌ల గురించి తెలుసుకున్నారు. సున్నిత‌మైన అంశాల‌పై స్పందించేట‌ప్పుడు నేత‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎవరి గురించి కానీ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయొద్దు  అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: