తెలుగు ఇండస్ట్రీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్ గా మారిన నటీమణి శ్రీదేవి. 80వ దశకంలో నెంబర్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన శ్రీదేవి అనాటి తరమే కాదు వారి వారసులతో కూడా నటించి మెప్పింది.  తెలుగు, తమిళ, కన్నడ, మళియాళీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన శ్రీదేవి తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
Related image
అక్కడ కూడా తన సత్తా చాటుతూ ఎన్నో విజయాలు సాధించింది. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బోనీక కపూర్ ని వివాహం చేసుంది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.  ఈ మద్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది శ్రీదేవి.  సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరి సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవా తాజాగా  ఫ్యాషన్‌ ట్రెండ్‌ను నుసరిస్తోంది.

ఇటీవల బెంగళూరులో ఓ నగల వ్యాపార సంస్థ ఫ్యాషన్‌ షో నిర్వహించింది.  రెడ్.. గోల్డ్ ప్రింటెడ్ మిక్సిడ్ గౌనులో.. ఒంటిపై బంగారంతో ఆమెను చూసిన వారు ఇండస్ట్రీకి మరోసారి అతిలోక సుందరి ఎంట్రీ ఇస్తుందా అని అంటున్నారు.  సంప్రదాయ దుస్తులు.. నగలతో ర్యాంప్ వాక్ చేసి అక్కడున్నవారి మతి పోగొట్టేశారు. ఇప్పటికీ వన్నె తగ్గకుండా.. అతిలోక సుందరిలా మెరిసిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: