బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన సంజయ్ లీలా బన్సాలీ మరో అద్భుతమైన బయోస్కోపిక్ చిత్రాన్ని సినీ అభిమానులకు అందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, రణ్వీర్సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పద్మావతి. మొదటి నుంచి ఈ చిత్రం ఎన్నో కాంట్రవర్సీలకు గురి అవుతూ వచ్చింది. అంతే కాదు షూటింగ్ సమయంలో ఎన్నో అవాంతరాలు కూడా ఎదుర్కొన్నారు సంజయ్.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఇక అక్టోబర్ 9న ‘పద్మావతి’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ రిలీజయిన 24 గంటల్లోనే యూట్యూబ్లో ఉన్న రికార్డులను తిరగరాసింది. 24 గంటల్లో పద్మావతి ట్రైలర్కు వచ్చిన వ్యూస్ బాలీవుడ్లో ఇదివరకు ఏ మూవీ ట్రైలర్కు రాలేదు. 24 గంటల్లోనే కోటీ 97 లక్షల వ్యూస్ వచ్చాయి.
ప్రస్తుతం ఈ ట్రైలర్ కి వచ్చిన వ్యూస్ 2 కోట్ల 10 లక్షలు. రానున్న రోజుల్లో ఇది మరింత దాటే అవకాశం ఉందని అంటున్నారు. ఒక ట్రైలరే ఇన్ని రికార్డులను సృష్టిస్తే.. మూవీ రిలీజయ్యాక ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అని అంచనాలు వేస్తున్నారు సినీ అభిమానులు.