పెళ్లి జరిగిన మరుసటి రోజునే భర్త కి షాక్ ఇచ్చిన ఒక వీరవనిత స్టోరీ ఇది. కొత్త పెళ్లి కూతురు కదా అని ఏది కావాలి అంటే అది కొనిపెడదాం అనుకున్న భర్త కి ఒక నూతన పెళ్లి కూతురు ఇచ్చిన షాక్ చూడండి. మేడ్చెల్ జిల్లా కీసర మండల ఆర్ ఎల్ నగర్ లో పాల వ్యాపారం చేసుకుని మాదినేని తిరుపతయ్య (23) తో కడప జిల్లా మైదుకూరు కి చెందిన రాజపుత్ర శివ మల్లేశ్వరి (19) కి ఈ నెల 1 న పెద్దలు వివాహం చేసారు.

వివాహం జరిగిన వెంటనే తిరుపతయ్య ఆమెని హైదరాబాద్ తీసుకుని వచ్చాడు. తరవాత రోజు ఆమె ప్రేమగా సినిమాకి తీసుకుని వెళ్ళండి అంటే సరే సరే అంటూ తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ కలిసి జై లవ కుస సినిమా చూసారు. సినిమా పూర్తి అయిన తరవాత ఆమె అతన్ని పిజ్జా కావాలి అంటూ ప్రేమగా కోరింది.

కొత్త కాపురం పైగా పల్లెటూరు నుంచి వచ్చిన భార్య సో కాదు అనలేడు కదా సరే పద పిజ్జా షాప్ కి వెళ్లి అక్కడే తిందాం అన్నాడు. కాదు కాదు మీరు పార్సిల్ తీసుకుని రండి అంది ఆమె. ఉంచి, పిజ్జా తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్లి వచ్చేసరికి ఆమె ఓ ఆటోలో వెళ్లిపోతుండడం కనిపించింది. దీంతో ఆమె కోసం గాలింపు చేపట్టాడు.

దొరకకపోయేసరికి తిరుపతయ్య కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెని ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదు అనీ ఆమె స్వయంగా ఆటో మాట్లాడుకుని ఎక్కి వెళ్ళిపోయింది అని చెబుతున్నారు స్థానికులు.


మరింత సమాచారం తెలుసుకోండి: