పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది అంటే ఇక టాలీవుడ్ లో ఆ దర్శకుడి మైలేజ్ పెరిగినట్టే. అది కూడా అర్జున్ రెడ్డి లాంటి సంచలనం సృష్టించిన దర్శకుడికి ఈ ఛాన్స్ వస్తే ఇక తిరుగే లేదు. ప్రస్తుతం అలాంటి వార్తే ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. అర్జున్ రెడ్డి సినిమా డైరెక్ట్ చేసిన సందీప్ వంగకు పవన్ స్పెషల్ విషెష్ అందచేశాడట.


ఇక తన డైరక్షన్ టాలెంట్ చూసి మంచి కథ ఉంటే చెప్పు చేద్దాం అన్నాడట పవన్ కళ్యాణ్. ఇక తన దగ్గర ఉన్న లైన్ చెప్పగా డెవలప్ చేయ్యమని చెప్పినట్టు టాక్. ఈమధ్యనే మైత్రి మూవీస్ తో తన తర్వాత సినిమా అగ్రిమెంట్ చేసుకున్న సందీప్ కుదిరితే ఆ నిర్మాణ సంస్థలోనే పవర్ స్టార్ తో సినిమా చేసే అవకాశాలున్నాయట. 


విజయ్ దేవరకొండ, షాలిని పాండే కలిసి నటించిన అర్జున్ రెడ్డి సినిమా 4 కోట్ల బడ్జెట్ తో వచ్చి 40 కోట్ల దాకా వసూళు చేసింది. బోల్డ్ కంటెంట్ తో వచ్చినా ఆ సినిమాలో సీరియస్ నెస్ అందరికి నచ్చింది. ఇక పవన్ తో సందీప్ నిజంగా సినిమా చేస్తే ఆ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయంపై అంచనాలు ఏర్పడుతున్నాయి.


పవర్ స్టార్ కు ఓ లీడర్ కు సంబందించిన కథ చెప్పాడని తెలుస్తుంది. ఎలాగు 2019 ఎన్నికల్లో జనసేన ప్రచారం షురూ చేయాల్సి ఉంటుంది కాబట్టి కచ్చితంగా సినిమా ఎంతోకొంత మైలేజ్ ఏరపరుస్తుందని చేయబోతున్నారట. మరి సందీప్ వంగతో పవర్ స్టార్ సినిమాపై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: