అందుకే ఆ రంగంలోని వారికి నాటి సాంప్రదాయవాదులు కొందరు పిల్ల నిచ్చి పెళ్ళిచేసే వారేకాదు. అది అక్కినేని నాగేశ్వర రావు గారి విషయములో కూడా జరిగిందని ఆయనే ఒక సందర్భంలో, ఒక రవీంద్రభారతిలో కార్యక్రమములో చెప్పారు. నాడు నటీమణులుగా రావటానికి సాంప్రదాయ కుటుంబాల వారు అంగీకరించలేని పరిస్థితి ఉండేది. నేడు ఆ రంగములో అనేక మంది "బహుముఖ ప్రఙ్జావంతులు వివిధ రంగాల నుండి ప్రత్యేక పాషన్" తో వస్తున్నారు. నేడు ఎవరూ ఎవరిని లైంగికంగా వేదించ లేరు "మనలో నిజంగా స్ట్రాంగ్ -విల్ ఉంటే"
ఒకరు బయట పడితే మరొకరు. అంతే తప్ప తప్పు జరిగే సందర్భంలో చర్యలెందుకు తీసుకోలేదు. చట్టం ఉంది కదా! కేసులు పెట్టొచ్చుకదా! కాని అప్పటి ప్రాథమ్యం అవకాశం. ఇప్పుడు అవికోకొల్లలు. అందుకే "వేరొకరి నాటి అవసరాన్ని తప్పని" ఇప్పుడు బయటకు చెప్పుకొని బయట పెడితే "తమ భాగస్వామ్యం" లో తప్పులేదా? అసలు "ఆ భాగస్వామ్యమే ధర్మవిరుద్ధం, న్యాయవిరుద్ధం కనీసం చట్టవిరుద్ధం అనైనా గమనించాలి" కదా!
మొదటి డిమాండ్ నే నిష్కర్షగా తిరస్కరిస్తే వీరంటే అవకాశవాదులకు భయం పుడుతుంది. మరోసారి అదే ఆలోచన వారికి వస్తే క్షమించ కూడదు. అంతా జరిగాక చెప్పుకుంటే రచ్చ రచ్చ తప్ప ఇంకేం మిగల్దు. అంత కరక్ట్ గా ఉండాలంటే దారి తప్ప కుండా ప్రయత్నించండి. మీ లాగే కొందరు మంచి నిర్మాతలూ ఉంటారు.
'దుకాణం లో దొరికితేనే ఎవరైనా సరుకు కొంటారు'. చిత్ర రంగం చిత్రవిచిత్ర సంఘటనల సమాహారం. గతకాలంలో 'సినిమా' అంటే, "సిగ్గు, నియమం, మానం" వదిలేసిన వారే అక్కడ చలామణి అవుతారని ప్రతీతి. అక్కడ రాయటానికి గొప్ప కథలు, చూడటానికి అద్భుత దృశ్యాలు తప్ప, మాట్లాడు కోవటానికి ఘనతలు ఏమీ ఉండవు. మహా ఐతే అద్భుత వినోదం దొరుకుతుంది. వినోదం వండి వార్చేవార్చే చోట "సృజనాత్మకతకు అధిక ప్రాధాన్యం ఉంటుంది "ఆడ ... మని + షి" తోనే వారికి రిలాక్సేషన్" దొరుకుతుందని భావిస్తారు.
వాతావరణాన్ని కలుషితం చేసి శబ్ధ కాలుష్యం సృష్టించటం ఎమంత భావ్యం? వెలుపలికి వచ్చి సమాధానం చెప్పిన హ్రుతిక్ రోషన్ ఏమన్నాడు. ఆమే మా హోటల్ రూంలోకి ఫుల్లుగా తాగివచ్చిందని. అసలే అవకాశం కోసం మర్కటంగా మారిన మనిషి, ఆపై కల్లు తాగింది, నిప్పు తొక్కింది ఇంకేం పొందులో చిందేసి ఉండొచ్చు. అందుకే మనకు ప్రయోజనం చేకూర్చని విషయా లు "నిద్రలో జరిగినట్లు భావించి అంతా మర్చిపోతే మంచిదని" పరుచూరి సృజనాత్మక మాటల రచయిత తెలంగాణా శకుంత లతో "ఒక్కడు" సినిమాలో చెప్పకనే చెప్పించారు. అలాంటి నటీమణులు అది ఫాలో అయిపోతే మంచిది.
మహా పతివ్రతల శాతమెంత? అయినా వీరి పాతివ్రత్యాన్ని ఎవరు ప్రశ్నించారు? వీరి నోటి దూల తప్ప. నిజాయతీపరుల శాతం అత్యల్పం. బహుస్వల్పం. అందుకే 'గత జల సేతు బంధనం' అవసరమా? అనుకొని వదిలేస్తెనే గౌరవమైనా మిగుల్తుంది. లేకుంటే మీ పొట్టలు చించుకుంటే మీ కాళ్ళ పైనే పడుతుంది. "ప్రజలకు విచ్చలవిడి వినోదానికి ముడి సరుకు అవ్వటం ఎవ్వరికీ శ్రేయోదాయకం కాదు"