ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా ఉన్నది ఒకటే జిందగి. నేను శైలజ తర్వాత కిశోర్, రాం కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పైన అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమా ఆడియో వేడుక నిన్న రిలీజ్ అయ్యింది. సినిమా ఆడియో స్పీచ్ లో రామ్ కూడా ఎప్పుడు లేని జోష్ ఫుల్ గా మాట్లాడాడు.  


ఉన్నది ఒకటే జిందగి సినిమాకు నాలుగు పిల్లర్లు దేవి,కిశోర్ తిరుమల, స్రవంతి రవికిశోర్, సమీర్ రెడ్డి అంటూ చెప్పిన రామ్ ఇన్నేళ్లకు కాని ఇండస్ట్రీకి ఎందుకొచ్చానో తెలిసిందని అన్నాడు. కొన్నాళ్లు రొటీన్ సినిమాలతో అపవాదాలు మూటకట్టుకున్న రామ్ నేను శైలజతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో కొత్తగా కనిపించిన రామ్ మళ్లీ ఆ తర్వాత వచ్చిన హైపర్ సినిమాతో రొటీన్ సినిమా అనిపించాడు.  


ప్రస్తుతం రాబోతున్న ఉన్నది ఒకటే జిందగి సినిమాలో రాక్ స్టార్ గా కనిపిస్తున్నాడు రామ్. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేయగా సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను అలరిస్తుందని నమ్మకంతో ఉన్నారు. 


ఇక ఆడియోకి వర్షం పడుతున్నా లెక్క చేయకుండా వచ్చిన ఫ్యాన్స్ గురించి కూడా మాట్లాడాడు రామ్. ఇక డైలాగ్ తో ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచి ఆకట్టుకున్నాడు. అక్టోబర్ 27న రిలీజ్ అవుతున్న ఉన్నది ఒకటే జిందగి సినిమా రామ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: