బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన  ‘క్వీన్’ కంగనా రనౌత్’పై పరువునష్టం దావా వేశారు సీనియర్ నటుడు ఆదిత్య పంచోలి, ఆయన భార్య జరీనా వహబ్ లు కంగనపై పరువునష్టం దావా వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచోలి తనను శారీరకంగా హింసించేవాడని కంగన తీవ్ర ఆరోపణలు చేసిన విషయ తెలిసిందే. కంగనా సోదరి రంగోలీ ఏకంగా వీరిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉందని బాంబు పేల్చింది. ఈ ఆరోపణలని పంచోలి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Image result for kangana ranaut aditya pancholi
ఆమెను తాను హింసించానన్న ఆరోపణల్లో వాస్తవం లేదని... ఈ ఆరోపణలను మౌనంగా భరించాల్సిన అవసరం తనకేంటని అన్నారు.  మరోవైపు పరువునష్టం దావాలో కంగన సోదరి రంగోలీ పేరును కూడా చేర్చినట్టు సమాచారం. కంగనా సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో ఆదిత్య పంచోలి ఆమెకు గాడ్ ఫాదర్ గా వ్యవహరించారు. తన కుటుంబ సభ్యుల ప్రస్తావనను కూడా తీసుకొస్తూ, తన పరువును బజారుకీడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Image result for kangana ranaut aditya pancholi
 కంగనా కెరీర్ మొదట్లో ఆదిత్య పంచోలి ఆమెతో క్లోజ్ గా ఉండేవారు కానీ ఆ తర్వాత విభేదాలతో ఇద్దరు దూరమయ్యారు. హృతిక్ రోషన్ తో కంగానా ఎఫైర్ వెలుగులోకి రావడంతో.. పంచోలీ దూరం జరిగినట్టు బాలీవుడ్ వర్గాలు చెప్పుకొంటున్నారు.
Image result for kangana ranaut aditya pancholi
గత కొంత కాలంగా కంగనా తన వ్యక్తిగత విషయాలు..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.   ఈనేపథ్యంలో వీరిద్దరికీ పంచోలీ లీగల్ నోటీసులు పంపారు. అయితే, ఈ నోటీసులకు వీరిద్దరూ స్పందించకపోవడంతో, చివరకు పరువు నష్టం దావా వేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: