అటు ఇటుగా ఉన్న రామ్ కెరియర్ ను నేను శైలజ సినిమా హిట్ తో సెట్ చేసిన దర్శకుడు కిశోర్ తిరుమల. ఆ సినిమా హిట్ తో రామ్ కెరియర్ లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. ఇక అదే కాకుండా ఇప్పుడు ఆ ఇద్దరి కాంబినేషన్ లోనే ఉన్నది ఒకటే జిందగి సినిమా వస్తుంది. ఆ సినిమా కూడా హిట్ బొమ్మే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 


ఇక ఈ సినిమా తర్వాత కిశోర్ తిరుమల నానితో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే నానికి లైన్ చెప్పాడట ఓకే చెప్పడంతో ఫుల్ వర్షన్ రెడీ చేశాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. లవ్ స్టొరీస్ స్పెషలిస్ట్ గా సినిమాలు తీస్తున్న కిశోర్ తిరుమల నాని కోసం ప్రేమలో కొత్త కోణాన్ని చూపిస్తున్నాడట.


ప్రస్తుతం నాని వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎంసిఏ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే మేర్లపాక గాంధితో కృష్ణార్జున యుద్ధం తెరకెక్కనుంది. ఇక అది పూర్తయ్యాక అసలైతే హనుతో సినిమా చేయాల్సింది కాని కిశోర్ లైన్ లోకి వచ్చే సరికి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. అదికాక లై సినిమాతో హను ఫ్లాప్ ఫేస్ చేశాడు కాబట్టి అతనికి నాని హ్యాండ్ ఇచ్చాడని అంటున్నారు. 


మొత్తానికి నాని కెరియర్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయన్న మాట. వరుసవిజయాలతో దూసుకుపోతున్న నాని రాబోతున్న సినిమాలు కూడా సూపర్ హిట్ కొట్టినట్టే. అంచనాలను అందుకునేలా ఈ సినిమాలు ఉంటాయా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: