కోలీవుడ్ సూపర్ హీరో & టాప్ హీరో విజయ్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్సల్, ఈ సినిమా తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదలౌతుంది. భారీ బడ్జెట్ తో అట్లీ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుగా ఈ నెల 18 న రిలీజ్ అవుతోంది. విజయ్ ఇమేజ్ కు తోడు గత రెండు వారాలుగా కోలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవటంతో మెర్సల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే అదే సమయంలో కొంత మంది వెబ్ సైట్ నిర్వాహకులు మెర్సల్ సినిమాను వీలైనంత త్వరగా పైరసీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే హైకోర్ట్ తీర్పు చిత్ర యూనిట్ కు ఊరటనిచ్చింది. దేశ వ్యాప్తంగా పైరసీకి పాల్పడుతున్న 2650 వెబ్ సైట్స్ ను బ్లాక్ చేయాల్సిందిగా 37 ఇంటర్ నెట్ సర్వీస్ లను చెన్నై హైకోర్ట్ ఆదేశించింది. విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో సమంత, కాజల్, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.