నటుడిగా ఉంటూ సడెన్ గా నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. రవితేజ సినిమాతోనే నిర్మాతగా మారిన గణేష్ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లతో సినిమాలు తీశాడు. కొన్నాళ్లుగా నిర్మాణ భాధ్యతలకు దూరంగా ఉంటున్న గణేష్ ఈసారి మళ్లీ రవితేజ సినిమాతో స్టార్ట్ చేస్తున్నాడట.


ప్రస్తుతం రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో రాబోతున్నాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రవితేజ గుడ్డివాని పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఆ సినిమాతో పాటుగా విక్రం సిరి డైరక్షన్ లో టచ్ చేసి చూడు సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఈమధ్య కాలంలో వచ్చిన బోగన్ సినిమాను తెలుగు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు రవితేజ.


ఆ సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తాడని తెలుస్తుంది. అయితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అన్నది మాత్రం తెలియట్లేదు. బెంగాల్ టైగర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న రవితేజ మళ్లీ వరుస సినిమాలతో రాబోతున్నాడు. మాస్ మాహరాజ్ జోష్ చూస్తుంటే రాబోతున్న సినిమాలతో మళ్లీ తన సత్తా చాటుతాడని అనిపిస్తుంది.


ఇక ఇదే కాకుండా రవితేజ శ్రీనువైట్ల సినిమా కూడా డిస్కషన్స్ లో ఉంది. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల రవితేజ సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి వరుస సినిమాలతో రవితేజ ప్లాన్ అదిరిపోతున్నా వాటి ఫలితాలు ఎలా ఉండబోతాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: