మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా, కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా వస్తున్న చిత్రం 'అజ్ఞాతవాసి' కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ దీపావళికి రిలీజ్ చేస్తారని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి 'అజ్ఞాతవాసి' ఫస్ట్ లుక్ దసరాకు రావాలసి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు.
కాకపోతే దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు సూచాయిగా తెలిపారు చిత్ర యూనిట్. మొదటి నుంచి చిత్రానికి సంబంధించి ప్రతి అంశం ఎంతో గోప్యంగా ఉంచుతున్న చిత్ర యూనిట్..ఫస్ట్ లుక్ పై కూడా సస్పెన్స్ కొనసాగిస్తుంది. పవన్ నటిస్తున్న ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేసిన విషయం తెలిసిందే.
దీపావళికి ఫస్టులుక్ ను రిలీజ్ చేయడం ఖాయమని భావించారు. ఆ రోజు కోసం ఆత్రుతగా .. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళికి కూడా ఫస్టులుక్ ను రిలీజ్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ లేరన్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.
మొదటి నుంచి ఈ కాంబినేషన్ పై వచ్చే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతుంటాయి..అందే కోసమే పవన్ కళ్యాన్ సినిమా విషయంలో ఎలాంటి దొందరపాటు అనౌన్స్ మెంట్స్ చేయొద్దని ముందు నుంచి చెబుతున్నారట. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరికొంత సమయం తీసుకుని .. మంచి సందర్భం చూసుకుని ఆయన ఈ సినిమా ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు.