మరొక సూపర్ డూపర్ హిట్ మహానుభావుడు తో ఈ ఏడాది అప్పుడే రెండు హిట్ సినిమాలు సాధించేసాడు హీరో శర్వానంద్. ఏ కుర్ర హీరో చెయ్యలేని ఫీట్ చేసిన శర్వా పెద్ద పెద్ద హీరోల నడుమ ఫుల్ కాంపిటీషన్ తో వచ్చినా కూడా తిరుగులేని బ్లాక్ బస్టర్ లు సాధిస్తున్నాడు. ప్రస్తుతం శర్వా - సుదీర్ వర్మ కలిసి ఒక చిత్రానికి సిద్ధం అవుతున్నారు.

ఈ సినిమాలో మొట్టమొదటిసారి శర్వానంద్ ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నివేత థామస్ ఓకే అయిపొయింది. మరొక హీరోయిన్ గా అర్జున్ రెడ్డి ఫేం శాలినీ రెడ్డి ని కన్సిడర్ చేస్తున్నారు అని తెలుస్తోంది.

ఇప్పటికే మహానటి సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సంతకం పెట్టింది శాలిని రెడ్డి. ఈ సినిమా తరవాత తమిళం లో 100% లవ్ కి ఓకే చెప్పి షూటింగ్ లో కూడా పాల్గొంటోంది.

ఇప్పుడు తక్కువ టైం లో శర్వానంద్ లాంటి హీరోతో శాలిని ఛాన్స్ దక్కించుకోవడం పెద్ద విషయం అనే చెప్పాలి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె అర్జున్ రెడ్డి లాంటి ఛాన్స్ కోసం చాలా కష్టపడ్డాను అని చెబుతోంది. ఇప్పుడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఆమె కెరీర్ ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: