నేను శైలజ చిత్రం తో లైం లైట్ లోకి వచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు టాప్ హీరోల పక్కన నటిస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిలా భాషలలో వరుసగా  ఆఫర్లు కొట్టేస్తోన్న ఆమె అలనాటి సావిత్రి జీవిత నేపధ్యం తో తెరకి ఎక్కుతున్న మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించడం గొప్ప విషయం.

ఈ సినిమాని ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్టర్ నాగ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయట పడింది. మహానటి సినిమా యూనిట్ మొత్తం ఇప్పుడు మహామహులతో నిండిపోయింది.

సావిత్రి సినిమాలో ఎస్వీఆర్ గా మోహన్ బాబు కనిపిస్తారు, ఇక కేవీ రెడ్డి అనే డైరెక్టర్ అప్పట్లో టాప్ డైరెక్టర్ సావిత్రి ఆయనతో చాలానే సినిమాలు చేసారు. ఆ పాత్రలో డైరెక్టర్ క్రిష్ ఉంటారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా గా సాగుతోంది.

సింగీతం శ్రీనివాసరావు పాత్ర లో పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కనిపిస్తారు . సింగీతం అప్పట్లోని మాయాబజార్ సినిమాకి అసిస్టెంట్ గా పనిచేసారు కూడా. మాయాబజార్ లోని వివాహభోజనంబు సాంగ్ ని మళ్ళీ మోహన్ బాబు మీద రీషూట్ చేసే ఆలోచనలో కూడా ఈ చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: