పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ ఇద్దరు ఒకేచోట కలిస్తే ఇక అది ఎలా ఉంటుందో తెలిసిందే. రాం చరణ్ పెళ్లినాడు కలిసిన ఈ ఇద్దరు ఇప్పుడు మళ్లీ కలిసి సందడి చేశారు. త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ సినిమా ముహుర్తానికి క్లాప్ కొట్టేందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 


ముహుర్తంతో పాటు మొదటి షాట్ కు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టాడు. త్రివిక్రం పవన్ మంచి సన్నిహితులు అందుకే త్రివిక్రం పిలవగానే పవన్ వచ్చేశాడు. అది కాకుండా పవన్ ప్రస్తుతం త్రివిక్రం సినిమానే చేస్తున్నాడు. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవనుంది. ఎన్.టి.ఆర్ సినిమా ఈరోజు ముహుర్తం పెట్టినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం కాస్త టైం పడుతుందని అంటున్నారు. 


ఇక పవన్ త్రివిక్రం సినిమాకు అజ్ణాతవాసి అనే టైటిల్ పరిశీలణలో ఉంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పవన్ సినిమా పూర్తికాకుండానే ఎన్.టి.ఆర్ సినిమాకు ముహుర్తం పెట్టేశారు. సినిమాలో తారక్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.   


జై లవ కుశ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న ఈ సినిమాకు పవన్ క్లాప్ కొట్టడం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.  సమ్మర్ కల్లా సినిమా రిలీజ్ చేస్తారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: