బాలీవుడ్ లో గత కొంత కాలంగా అలియాభట్.. జాక్విలైన్ ఫెర్నాండెజ్ మధ్య కోల్డ్వార్ సాగుతుందని ఎన్నో వార్తలు వచ్చాయి. దీనికి కారణం యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సిద్దార్థ్ మల్హోత్రా-అలియాభట్ ప్రేమించుకుంటున్నారనే విషయం బాలీవుడ్ లో అందరికీ తెలుసు. అయితే వీళ్లిద్దరి మధ్యలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంటరైంది.
దీంతో సిద్దార్థ్-అలియా మధ్య దూరం పెరిగిందంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. కాకపోతే సిద్దార్థ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటోంది జాక్వెలిన్. అతడితో డేటింగ్ చేయాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని తమ మధ్య ఏమీ లేదనే విషయాన్ని క్లియర్ గా అలియా భట్ కు వివరించానని ఓ టీవీ రియాలిటీ షోలో బయటపెట్టింది జాక్వెలిన్.
తాజాగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తమ మద్య ఎలాంటి గొడవలు లేవని మరోసారి నిరూపించుకున్నారు. రియల్లైఫ్లో తామంతా ఒక్కటేనని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. దీపావళి రోజు ఓ సెలబ్రిటీ ఇంటికి వెళ్లినప్పుడు అలియాభట్, జాక్విలైన్ ఫెర్నాండెజ్ ప్రేమతో ముద్దు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి తమ మధ్య విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు.