నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ గా జై సింహా అని పెడుతున్నారట. సినిమా ప్రస్తుతం అరకులో షూటింగ్ జరుపుకుంటుంది. బాలయ్యలోని మాస్ యాంగిల్ మరోసారి బయటకు తీసేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హరిప్రియ, నటాషాలు కూడా నటిస్తున్నట్టు తెలిసిందే.


ప్రస్తుతం అరకు షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు ఉంటుందట. సి.కళ్యాణ్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు జై సింహా అనే టైటిల్ ఖారారు చేసినట్టు తెలుస్తుంది. బాలయ్య కెరియర్ లో సిం హా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా సెంటిమెంట్ తో బాలయ్య రవికుమార్ సినిమాకు జై సింహా అని పెట్టించారని టాక్.


100 సినిమాలు పూర్తి చేసుకున్న బాలయ్య శాతకర్ణి సినిమా తర్వాత నూతన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. పైసా వసూల్ రిలీజ్ టైంలోనే ఈ సినిమాను స్టార్ట్ చేసిన బాలకృష్ణ సంక్రాంతి బరిలో జై సింహాను దించబోతున్నారు. అయితే డిసెంబర్ కల్లా సినిమాను పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తారట.  


ఇక ఈ సినిమా తర్వాత తేజ డైరక్షన్ లో బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత త్వరలోనే ఓ క్రేజీ మల్టీస్టారర్ కూడా చేస్తాడని అంటున్నారు. మరి ఫలితాలు ఎలా ఉన్నా బాలయ్య సినిమాల జోరు మాత్రం అదరగొడుతున్నాడని చెప్పాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: