సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీ, నటులకు బైక్స్, కార్లు అంటే విపరీతమైన మోజు ఉంటుంది.  మార్కెట్ లోకి ఏది కొత్త కారు, బైక్ వచ్చిన తమ సొంతం చేసుకోవాలని కుతూహలం ఉంటుంది..అంతే కాదు పోటీ పడీ మరి తమ గ్యారేజ్ కి వచ్చేదాక నిద్రపోని వారు కూడా కొంత మంది ఉంటారు.  అలాంటి వారిలో బహుభాషా నటుడు రంగనాథన్ మాధవన్ ఒకరు.  ఈ హీరో   ఐదు, పది లక్షలు కాదండీ..ఏకంగా  దాదాపు రూ.40.45 లక్షలు వెచ్చించి దీపావళి సందర్భంగా అతడు ఒక సరికొత్త లగ్జరీ క్రూజర్ (బైక్) కొన్నాడు.

అమెరికా కంపెనీ తయారు చేసిన ఈ ‘ఇండియాన్ రోడ్ మాస్టర్’ను సొంతం చేసుకున్నాడు. తన గ్యానేజ్ లోకి కొత్తగా చేరిన ఈ బైక్ పై మాధవన్ చక్కర్లు కొట్టాడు. దీన్ని దక్కించుకోవడం తనకెంతో గర్వంగా ఉందని అతడు తెలిపాడు. యూఎస్ బీ, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ లైట్లు, క్రూజ్ కంట్రోల్, రిమోట్ లాకింగ్ వంటి సదుపాయాలు కూడా ‘ఇండియాన్ రోడ్ మాస్టర్ లో ఉన్నాయి. 

ఎంతో ఖరీదైన టూ వీలర్స్ బీఎండబ్ల్యూ కే1600 జీటీఎల్, డ్యుకాటీ డియావెల్, యమహా వీ-మ్యాక్స్ ఉన్నాయి.  బూడిద, నలుపు రంగులో మెరిసిపోతున్నఈ టూవీలర్ చూడగానే అకట్టుకునే విధంగా ఉంది.
Image result for madhavan new look
1811 సీసీ థండర్ స్ట్రోక్ 111, విట్విన్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్ బ్యాక్స్, 64.4 లీటర్ల సామర్థ్యం కలిగిన పెట్రోల్ ట్యాంక్ తో పాటు 7 ఇంచుల టచ్ స్ర్కీన్ ఎంటర్ టైన్ మెంట్ సిస్టం కూడా ఉంది.  అంతే కాదండోయ్ ఈ బైక్ ఎక్కితే హాయిగా మ్యూజిక్ వింటూ నావిగేషన్ చూసుకుంటూ ఎంచక్కా అనుకున్న ప్రదేశానికి చేరుకోవొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: