ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న విరాట్ కోహ్లీ , అనుష్క శర్మ ల వివాహం విషయం లో ఒక కంక్లూజన్ వచ్చినట్టు కనిపిస్తోంది. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఒకటి కాబోతున్నారు అనే వార్తలు ఇప్పుడు ముంబై లో గుప్పు మంటున్నాయి. డిసెంబర్ లో జరగబోతున్న శ్రీలంక సీరీస్ లో ఒక టెస్ట్ మ్యాచ్ కోసం కోహ్లీ బీసీసిఐ నుంచి విరామం కోరాడు.దీంతో డిసెంబర్ లో వీరిద్దరి పెళ్ళీ ఉంటుంది అని చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాలు.

డిసెంబర్ నెలలో అంగరంగ వైభవంగా దేశం మొత్తం చూసేలా వీరిద్దరి పెళ్లి ని వారి పేరెంట్స్ ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది. రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2013 నుంచే ప్రాణ స్నేహితులు. 2015 ప్రాంతలో వీరిద్దరూ విడిపోయారు అంటూ ఇంటర్నెట్ లో న్యూస్ గుప్పు మంది. ఆ తరవాత కాలం లో మళ్ళీ ఎప్పుడు కలిసారో కలిసిపోయారు. 

కోహ్లీ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నప్పుడు అనుష్క బహిరంగంగా అతడికి మద్దతు తెలిపింది. కాగా, ఇటీవల ఇద్దరూ కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించారు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఇద్దరూ ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోవడం కనిపించింది.

పెళ్లి పీటల వరకూ తమ వివాహ బంధం తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్న వీరిద్దరూ అభిమానుల సాక్షిగా ఒక రిసెప్షన్ ని కూడా ఏర్పాటు చెయ్యాలని చూస్తున్నారట. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘విరుష్క’ వివాహం వార్తలతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: