యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా వచ్చి సంచలన విజయం అందుకున్న జై లవ కుశ స్పూర్తితోనే బాలయ్య 102వ సినిమా టైటిల్ ఉండబోతుందని అంటున్నారు. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు నిన్న మొన్నటిదాకా కర్ణ టైటిల్ పెడుతున్నారని అన్నారు. కాని ఆ టైటిల్ కాకుండా ఇంతకుముందు అనుకున్న జై సింహా టైటిల్ కే ఓటేశారట.


ఈ విషయంలో ఎన్.టి.ఆర్ ను ఫాలో అవుతున్నాడు బాలయ్య బాబు. జై లవ కుశలో జై పాత్రతో మరోసారి తన నటనా ప్రతిభ చాటుకున్న తారక్ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాడు. అదే రీతిలో రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న జై సింహాలో కూడా బాలయ్య నట విశ్వరూపం చూస్తామని అంటున్నారు. ఇక సింహా సెంటిమెంట్ ఎలాగు ఉంది కాబట్టి ఈ సినిమాకు జై సింహా ఫిక్స్ చేశారట.


నయనతారతో పాటుగా హరిప్రియ, నటాషా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తుంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అరకులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ కల్లా పూర్తి చేస్తారని టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: