తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా రాజకీయ, విద్యావేత్తగా రాణిస్తున్నారు.  అంతే కాదు పలు సినిమాలకు దర్శకత్వం, నిర్మాణా బాధ్యతలు కూడా చేపట్టారు.  ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్ లతో పాటు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి బుల్లితెరపై యాంకర్ గా,  వెండితెరపై నటిగా తన సత్తా చాటుతున్నారు.

తాజాగా మంచు మోహన్ బాబు ఇంట విషాదం నెలకొంది. మోహన్ బాబు చెల్లెలు విజయలక్ష్మి భర్త మేడసాని వెంకటాద్రినాయుడు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి 8.30 గంటలకు ఆయన మృతి చెందారు.  సాయంత్రం 4 గంటలకు నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 

వెంకటాద్రినాయుడు, మోహన్ బాబు నటించిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు, తిరుపతిలో మోహన్ బాబు స్థాపించిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల కోశాధికారిగా కూడా ఆయన వ్యవహరించారు. వెంకటాద్రినాయుడి మృతిపట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: