సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ - ఏ వ‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న 2.0 సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త వ‌చ్చినా కూడా పెద్ద సంచ‌ల‌నంగా మారుతోంది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఏ సినిమా తెర‌కెక్క‌ని రేంజ్‌లో ఏకంగా రూ.450 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇటీవ‌లే సినిమాకు గుమ్మ‌డికాయ కూడా కొట్టేశారు. ఇటీవ‌ల దుబాయ్‌లో జ‌రిగిన 2.0 ఆడియో వేడుకే క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో జ‌రిగింది. ఓ ఇండియ‌న్ సినిమా ఆడియో దుబాయ్‌లో ఆ రేంజ్‌లో జ‌ర‌గ‌డం ఇదే ప్ర‌థ‌మం. 

rajani 2.0 movie కోసం చిత్ర ఫలితం

2.0 ఆడియో వేడుక సంద‌ర్భంగా దుబాయ్ న‌గ‌రం మొత్తం ఈ సినిమా బ్యాన‌ర్ల‌తోనే నింపేశారు. దుబాయ్‌తో పాటు ఆల్ అర‌బ్ కంట్రీస్‌లో ఇది పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ సినిమా కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీయే కాదు హాలీవుడ్ ఇండ‌స్ట్రీ కూడా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై మ‌రో ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 


2.0 ర‌న్ టైం శంక‌ర్ గ‌త సినిమాల కంటే చాలా చాలా త‌క్కువుగా ఉందని స‌మాచారం. శంక‌ర్ సినిమాలు అంటే ర‌న్ టైం చాలా చాలా ఎక్కువుగా ఉంటుంది. రోబో, శివాజీ, ఐ ఈ సినిమాల ర‌న్ టైం దాదాపుగా మూడు గంట‌లుగా ఉంటుంది. అయితే 2.0 సినిమాను శంక‌ర్ హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నారు. దీంతో 2.0కు శంక‌ర్ కేవ‌లం 140 నిమిషాలే ఫిక్స్ చేశార‌ట‌.

rajani 2.0 movie కోసం చిత్ర ఫలితం

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో ర‌జ‌నీ స‌ర‌స‌న ఐ ఫేమ్ అమీజాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ బాగా లేట్ అవ్వ‌డంతో ముందుగా అనుకున్న‌ట్టుగా జ‌న‌వ‌రి 25న కాకుండా వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో థియేట‌ర్ల‌లోకి తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: