సూపర్స్టార్ రజనీకాంత్ - ఏ వన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తోన్న 2.0 సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా కూడా పెద్ద సంచలనంగా మారుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమా తెరకెక్కని రేంజ్లో ఏకంగా రూ.450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇటీవలే సినిమాకు గుమ్మడికాయ కూడా కొట్టేశారు. ఇటీవల దుబాయ్లో జరిగిన 2.0 ఆడియో వేడుకే కనీవినీ ఎరుగని రేంజ్లో జరిగింది. ఓ ఇండియన్ సినిమా ఆడియో దుబాయ్లో ఆ రేంజ్లో జరగడం ఇదే ప్రథమం.
2.0 ఆడియో వేడుక సందర్భంగా దుబాయ్ నగరం మొత్తం ఈ సినిమా బ్యానర్లతోనే నింపేశారు. దుబాయ్తో పాటు ఆల్ అరబ్ కంట్రీస్లో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఈ సినిమా కోసం ఇండియన్ సినిమా ఇండస్ట్రీయే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
2.0 రన్ టైం శంకర్ గత సినిమాల కంటే చాలా చాలా తక్కువుగా ఉందని సమాచారం. శంకర్ సినిమాలు అంటే రన్ టైం చాలా చాలా ఎక్కువుగా ఉంటుంది. రోబో, శివాజీ, ఐ ఈ సినిమాల రన్ టైం దాదాపుగా మూడు గంటలుగా ఉంటుంది. అయితే 2.0 సినిమాను శంకర్ హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. దీంతో 2.0కు శంకర్ కేవలం 140 నిమిషాలే ఫిక్స్ చేశారట.
బాలీవుడ్ సూపర్స్టార్ అక్షయ్కుమార్ విలన్గా నటిస్తోన్న ఈ సినిమాలో రజనీ సరసన ఐ ఫేమ్ అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా లేట్ అవ్వడంతో ముందుగా అనుకున్నట్టుగా జనవరి 25న కాకుండా వచ్చే సమ్మర్లో థియేటర్లలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.