తెలుగు హీరోగా ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా తమిళ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించిన హీరో విక్రమ్.  తమిళ తంబీలు చియాన్ విక్రమ్ అని పిలుస్తారు.  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత అంతగొప్ప ప్రయోగాత్మక చిత్రాల్లో నటించింది విక్రమ్ ఒక్కడే అని చెప్పొచ్చు.  తాజాగా  విక్రమ్ కుమార్తె అక్షిత, డీఎంకే చీఫ్ ఎం కరుణానిధి ముని మనవడు మను రంజిత్‌ల వివాహం ఇవాళ గ్రాండ్‌గా జరిగింది. చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో అక్షిత, మను రంజిత్ ల పెళ్లి వేడుక జరిగింది.
 కొడుకు బాధ్యతను భుజాన
వివాహానంతరం వధూవరులిద్దరూ కరుణానిధి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్న అక్షిత, రంజిత్ .. డీఎంకే అధినేత కరుణానిధి ఎదుట ఒక్కటయ్యారు. చెన్నైలోని గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఈ వేడుక జరిగింది. కరుణానిధి ఎదుట అక్షిత మెడలో రంజిత్ మూడు ముడులు వేశాడు.
 సినిమాలతో విక్రమ్ బిజీ
ఈ వివాహం నేపథ్యంలో తమిళ సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఇరు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత అక్షిత ఫ్యామిలీ విక్రమ్, శైలజాబాలకృష్ణన్, మను రంజిత్ తల్లిదండ్రులు కరుణానిధితో కలిసి గ్రూఫ్ ఫొటో దిగారు. అక్షిత, మను రంజిత్ ల రిసెప్షన్ రేపు గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

గ్రాండ్‌గా నటుడు విక్రమ్ కుమార్తె వివాహం..
పెళ్లి వేడుకకు విక్రమ్ స్నేహితులు, ఫిలిం ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  తన కూతురి పెళ్లి చేసిన విక్రమ్.. తన కుమారుడు ధ్రువ్ కెరీర్ బాధ్యతను తన భుజాన వేసుకొన్నాడు.ప్రస్తుతం సామీ స్క్వేర్, ధ్రువ నక్షత్రం చిత్రాల షూటింగ్‌లో నిమగ్నమయ్యాడు. విక్రమ్ నటించిన స్కెచ్ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: