బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, పార్లమెంట్ సభ్యురాలు హేమమాలినికి తృటిలో ప్రమాదం తప్పింది.   మధుర రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలకు వెళ్లిన ఆమె నడుచుకుంటూ వస్తుండగా, ఓ ఎద్దు అదుపు తప్పి స్టేషన్ లోకి దూసుకు వచ్చింది. దాన్ని అదుపు చేయాలని కొంతమంది ప్రయత్నించడంతో, బెదిరిపోయి పరుగులు తీసింది. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతో అంతా సురక్షితంగా బయటపడ్డారు.
Image result for bull attack hema malini
ఇక ఎద్దు కూడా పక్కనుంచి వెళ్లిపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే స్టేషన్ లో పశువులు తిరగడంపై హేమమాలిని అధికారులపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోనని హెచ్చరించినట్లు సమాచారం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులను నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. ప్రజలకు సైతం సౌకర్యాలు లభించడం లేదని క్లాస్ తీసుకున్నారు. 

ఇదిలా ఉంటే ముంబై ఎల్‌పిన్‌స్టోన్‌ బ్రిడ్జి ఘటన అనంతరం ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లోని రైల్వే స్టేషన్ల ను దర్శించి సౌకర్యాలను, పరిస్థితులను సమీక్షించాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్  కోరిన విషయం తెలిసిందే.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: