తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్..ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాంగోపాల్ వర్మ ఈ మద్య ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా చేసుకొని ఎన్నో సంచలన ట్విట్స్ చేశారు. ఆయన ట్విట్స్ లో కుటుంబ సభ్యులు ఉండటం కూడా మరో విశేషం. ఆ మద్య తన తల్లితో తీయించుకున్న ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. తర్వాత కూతురు కి సంబంధించి వీడియో పోస్ట్ చేశారు.
తాజాగా తన తండ్రి కి సంబంధించిన ఓ రేర్ పిక్ పోస్ట్ చేసి తన తండ్రిపై ప్రతీకరాం తీర్చుకున్నానని ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. తాను సినీ దర్శకుడిని అవుతాననే విషయాన్ని తన తండ్రి ఎన్నడూ నమ్మలేదని వర్మ చెప్పాడు. అయితే, తన తొలి సినిమా అయిన 'శివ'కు తొలి క్లాప్ ను తన తండ్రితోనే కొట్టించానని... ఆ విధంగా ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నానని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు.
1989 ఫిబ్రవరి 16వ తేదీన ముహూర్తపు క్లాప్ ను నాగార్జున, అమలపై కొట్టారు. ఈ మద్య లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి ఎన్నో వివాదాలు ఎదుర్కొంటూ..ప్రశ్నించిన వారికి సమాధానం ఇస్తూ బిజీ బిజీగా ఉన్నారు.