టాలీవుడ్లో సీనియర్ హీరో బాలకృష్ణ - మాస్ మహరాజ్ రవితేజ మధ్య ఎప్పుడో పదేళ్ల క్రితం ఓ గొడవ జరిగిందన్న రూమర్ అయితే బలంగా ఉంది. ఈ ఇద్దరితోను ఒకే టైంలో జోడీ కట్టిన ఓ హీరోయిన్ విషయంలో ఏర్పడిన బేధాభిప్రాయాలు చాలా తీవ్రరూపం దాల్చినట్టు అప్పట్లో బయటకు వచ్చిన టాక్. ఆ తర్వాత వీరిద్దరి మధ్య గ్యాప్ మాత్రం అలాగే ఉందని ఇండస్ట్రీలో వినిపించే రూమర్. ఏదెలా ఉన్నా వీరిద్దరి సినిమాలు ఒకేసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే ఆ వార్ ఆసక్తిగా ఉంటుంది.
బాలయ్య సినిమాలపై రవితేజ కావాలనే తన సినిమాలను పోటీకి దింపుతాడన్న ప్రచారం కూడా ఉంది. గతంలో రెండు సార్లు సంక్రాంతికి వీరిద్దరు పోటీ పడ్డారు. 2008లో బాలయ్య సంక్రాంతికి ఒక్క మగాడు సినిమాతో వస్తే, రవితేజ కృష్ణగా వచ్చాడు. ఈ రెండు సినిమాల పోటీలో కృష్ణ హిట్ అవ్వగా ఒక్కమగాడు డిజాస్టర్ అయ్యింది. అప్పుడు రవితేజదే పైచేయి అయ్యింది.
ఇక మళ్లీ మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 2011లో మళ్లీ సంక్రాంతికే బాలయ్య పరమవీరచక్ర, రవితేజ మిరపకాయ్ సినిమాలతో వచ్చారు. ఈ సారి కూడా సేమ్ సీన్. పరమవీరచక్ర అట్టర్ప్లాప్, మిరపకాయ్ హిట్. ఇక వచ్చే సంక్రాంతికి కూడా వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలయ్య లేటెస్ట్ మూవీ జై సింహా సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇప్పుడు సడెన్గా రవితేజ కొత్త మూవీ టచ్ చేసి చూడు సినిమాను కూడా సంక్రాంతికే తెస్తున్నట్టు తెలుస్తోంది.
బాలయ్య తన సినిమా రిలీజ్ సంక్రాంతికే ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. అయితే రవితేజ మాత్రం ఇప్పటికిప్పుడు సడెన్గా తన సినిమాను సంక్రాంతి రేసులోకి తెచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రవితేజ ఇటీవలే రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు కావాలనే తన టచ్ చేసి చూడును సంక్రాంతికి తెస్తున్నాడట. మరి ఈ సారి సంక్రాంతి పోరులో బాలయ్య - రవితేజలలో ఎవరు గెలుస్తారో ? చూడాలి.