సామాన్యం గా సినిమా ఆడియో వేడుకలకు హీరోలు అతిధులు గా వస్తూ ఉంటారు. అయితే ఈ సారి మన టాలీవుడ్ లో జరిగే ఒక సినిమా ఆడియో ఫంక్షన్ ఈ సాంప్రదాయానికి విరుద్ధంగ జరగబోతోంది. తెలుగుతెరపై ఎప్పుడు కనిపిస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్న బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ త్వరలో మరో రూపంలో తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘చండి’ చిత్రం ఆడియో వేడుక ఆగస్ట్ 12న జరుగబోతోంది.  ఈ వేడుకకు ‘డర్టీ పిక్చర్’  భామ విద్య బాలన్  అతిథిగా రాబోతోంది.   

విద్యాబాలన్, ప్రియమణి ఇద్దరూ కజిన్స్ అన్న విషయం చాలా కొద్ది మంది కే తేలేసిన విషయం. అందుకే కాబోలు విద్యాబాలన్ లాగే ప్రియమణి ఎటువంటి పాత్రను అయినా డేరింగ్ గా చేస్తుంది. వి.సముద్ర దర్శకత్వంలో  ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో  శరవేగం గాజరుగుతోంది.  ఈ చిత్రం పాటలను గ్రాండ్‌గా విడుదల చేయడానికి ఈ సినిమా నిర్మాత  సన్నాహాలు చేస్తున్నారు. విద్యాబాలన్‌తో పాటు మరో అతిథిగా ప్రభాస్ కూడా  వస్తాడట.

ఈ  సినిమాలో   అశోక్‌గజపతిరాజుగా కృష్ణంరాజు ఒక ముఖ్య  పాత్ర స్వాతంత్ర సమరయోధుడుగా పోషిస్తున్నారు. అంతే కాకుండా  మరో శక్తిమంతమైన పాత్రలో తమిళ హీరో శరత్‌కుమార్ నటిస్తున్నారు.  మంచి నటి గా పేరున్న ప్రియమణి కి చండి సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది అని అంటున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: